శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం గురువారం నాడు కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు ఆయన కాసేపు కబడ్డీ ఆడారు. ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక టీమ్ తరఫున కబడ్డీ ఆడుతూ కాలు స్లిప్ కావడంతో కింద పడిపోయారు. స్పీకర్ కిందపడగానే ఆయన సిబ్బందితో పాటు ప్లేయర్లు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆయన్ను పైకి లేపారు.
Read Also: హీరో నానికి థాంక్స్ చెప్పిన మహిళా నేత
ఈ ఘటనలో స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. కాగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస జూనియర్ కాలేజీ వేదికగా నియోజకవర్గ స్థాయిలో సీఎం కప్ క్రికెట్, కబడ్డీ టోర్నమెంట్ను స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు.
