Site icon NTV Telugu

Heat Wave Predictions: ఢిల్లీలో వడగాలులు.. పాఠశాలలకు ప్రభుత్వ కీలక ఆదేశాలు

Heat Wave

Heat Wave

దేశరాజదాని ఢిల్లీలో ఎండ తీవ్రత పెరిగింది. వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది. వేడిగాలుల నేపథ్యంలో పాఠశాలలకు ఢిల్లీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.
Also Read:Thursday stotram: గురువారం ఈస్తోత్రం వింటే సమస్త పాపాలు, దోషాలు తొలగిపోతాయి

ఢిల్లీలోని అన్ని పాఠశాలలు మధ్యాహ్నం షిఫ్ట్ సమయంలో పాఠశాలల్లో విద్యార్థుల సమావేశాలు లేకుండా చూసుకోవాలని ప్రభుత్వ పేర్కొంది. వేసవి కాలంలో ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా ఉండడంతో పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్యానికి హానికరం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం సర్క్యులర్‌ జారీ చేసింది
Also Read:Karnataka elections: నేటి నుంచి నామినేషన్ల పర్వం.. 12 మంది బీజేపీ అభ్యర్థులపై సస్పెన్స్

పాఠశాలల్లో విద్యార్థులకు తాగునీటిని ఏర్పాటు చేయాలని, తరగతుల సమయంలో విద్యార్థులకు నీటి విరామం ఇవ్వాలని అధికారిక సర్క్యులర్‌లో పేర్కొన్నారు. పాఠశాలలు విద్యార్థులను పగటి పూట తలలు కప్పుకునేలా అవగాహన కల్పించాలని విద్యా డైరెక్టరేట్ తన సర్క్యులర్‌లో పేర్కొంది. పాఠశాలకు వస్తున్నప్పుడు లేదా బయటకు వెళ్లేటప్పుడు సూర్యరశ్మికి తగలకుండా గొడుగు, టోపీ, టోపీ, టవల్ తదితరాలను ఉపయోగించేలా విద్యార్థులు తమ తలలను కప్పుకునేలా అవగాహన కల్పించాలని ప్రభుత్వం తెలిపింది.

Exit mobile version