Site icon NTV Telugu

భారత్ లో 32కు చేరిన ఒమిక్రాన్ కేసులు

కరోనా రక్కసి రూపాలు మార్చుకొని ప్రజలపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌.. ఇప్పుడు భారత్‌లో కూడా వ్యాప్తి చెందుతోంది. ఇటీవల భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్‌ తన ప్రభావాన్ని చూపుతోంది. తాజాగా మహారాష్ట్రలో మరో 7 కొత్త ఒమిక్రాన్‌ కేసులు రావడంతో అధికారులు మరింత పటిష్టంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

తాజాగా ఒమిక్రాన్‌ కేసులతో భారత్‌లో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 32 కు చేరుకుంది. రాజస్థాన్‌లో 9, గుజరాత్‌లో 3, కర్ణాటకలో 2, ఢిల్లీలో 1 తో పాటు మహారాష్ట్రలో మొత్తం 17 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అయితే మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పక్కరాష్ట్రాల ప్రజలు భయాందోళనకు గురిచెందుతున్నారు.

Exit mobile version