NTV Telugu Site icon

Philippine: ఫిలిప్పీన్స్ లో అగ్నిప్రమాదం.. 31 మంది దుర్మరణం

Fire On Philippine Ferry

Fire On Philippine Ferry

ద‌క్షిణ ఫిలిప్పీన్స్‌ లో జ‌రిగిన అగ్ని ప్రమాదంలో 31 మంది మృతి చెందారు. ఫెర్రీలో మంటలు చెలరేగడంతో 31 మంది మరణించారు. 230 మందిని రక్షించినట్లు అధికారులు గురువారం తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. లేడీ మేరీ జాయ్ 3 మిండానావో ద్వీపంలోని జాంబోంగా సిటీ నుండి సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపానికి ప్రయాణిస్తుండగా బుధవారం మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు పైనుంచి దూకాల్సి వచ్చిందని విపత్తు అధికారి నిక్సన్ అలోంజో తెలిపారు.
Also Read:Air Quality in Hyderabad: హైదరాబాద్ కు ఊపిరి పోసిన వర్షం.. గాలి నాణ్యత మెరుగు

బాసిలాన్ ప్రావిన్స్‌లోని బలుక్ ద్వీపంలోని ఫెర్రీలో మంటలు చెలరేగడంతో ఫిలిప్పీన్ కోస్ట్ గార్డ్, మత్స్యకారులతో సహా రక్షకులు 195 మంది ప్రయాణికులు, 35 మంది సిబ్బందిని రక్షించారు. ఓడలో 18 మృతదేహాలను గుర్తించారు. ఫెర్రీలో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్ లో రెస్క్యూ సిబ్బంది మృతదేహాలను గుర్తించారు. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ప్రజలు నిద్రలో ఉన్నందున భయాందోళనలకు గురయ్యారు. మంటలు వ్యాపించడంతో కెప్టెన్ ఓడను పరిగెత్తించాడు. 14 మంది గాయపడ్డారని, ఏడుగురు గల్లంతయ్యారని అధికారులు ముందుగా తెలిపారు. కాలిపోయిన ఓడ శిథిలాల్లో అనేక మంది మృత‌దేహాల‌ను గుర్తించారు. ప్రమాద సమయంలో 205 మందిని ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాణాలతో బయటపడిన వారిని జాంబోంగా మరియు బాసిలన్‌లకు తీసుకెళ్లారు. అక్కడ గాయపడిన వారు కాలిన గాయాలకు చికిత్స పొందారని అధికారులు చెప్పారు.