Site icon NTV Telugu

ఇండియాలో కొత్తగా 11,271 కరోనా కేసులు..

ఇండియా ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,271 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది.. మరో 285 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు. ఇదే సమయంలో 11,376 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు 3,38,37,859 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. మరోవైపు యాక్టివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది.. ప్రస్తుతం దేశ్యాప్తంగా 1,35,918 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. రికవరీ రేటు 98.36 శాతానికి పెరిగింది. ఇక, మృతుల సంఖ్య 4,63,530 కి చేరింది. ఇక అప్పటి వరకు 1,12,01,03,225 మందికి కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు పేర్కొంది ఆరోగ్య శాఖ.

Exit mobile version