Site icon NTV Telugu

YS Sharmila: కాళేశ్వరం ప్రాజెక్టులో 70 వేల కోట్ల అవినీతి

Sharmila

Sharmila

తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణకు చేసింది ఏమి లేదని, తాగి ఫామ్ హౌజ్లో పడుకోవడమే తెలుసని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల విమ‌ర్శించారు. రాష్ట్రంలో వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇవాళ్టికి 113వ రోజు చేరింది. ఇందులో భాగంగా ఆమె హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి మండలం పరెడ్డి గూడెం గ్రామానికి చేరుకున్నారు. ఈ నేప‌థ్యంలో.. గ్రామస్థులతో వైఎస్ షర్మిల ముచ్చటించిన ష‌ర్మిళ ఆమె మాట్లాడుతూ.. 8 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు. అంతేకాదు.. ఏ ఒక్క రకంగా కూడా రాష్ట్రం బాగు పడలేదు. ఒక్క పథకాన్ని సరిగ్గా అమలు చేయలేదని .. కేసీఆర్ కు తాగి ఫామ్ హౌజ్ లో పడుకోవడం తెలుసు అని ఆమె మండిప‌డ్డారు.

read also: TS SSC Results: తల్లి భాషలో.. తగ్గిన ఉత్తీర్ణత. ‘పది’ ఫలితాలందు తెలుగు ‘లెస్‌’

సీఎం కేసీఆర్ ప్రాణాలకు చాలా విలువ ఉందట కానీ.. రైతులు, నిరుద్యోగుల ప్రాణాలకు విలువ లేదట అని మండిపడ్డారు. అయితే.. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారు అన్నారు. అంతేకాకుండా.. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 70 వేల కోట్ల అవినీతి అంటే దిమ్మ తిరిగిపోతుందని అశ్చర్యపోయారు షర్మిల. తెలంగాణ రాష్ట్రం మద్యం అమ్మకాల్లో తప్పా ఎక్కడ అభివృద్ధి లేదు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి బరోసా లేదని, అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పుట్టిందని, వైఎస్సార్ సంక్షేమం కోసమే రాజన్న బిడ్డ పార్టీ పెట్టిందని తెలిపారు. తెలంగాణ‌లో వైఎస్సార్ సంక్షేమ పాలన తిరిగి తేవడం కోసమే ఈ పార్టీ ఉందని, వైఎస్సార్ సుపరిపాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అవతరించిందని షర్మిల పేర్కొన్నారు.

Exit mobile version