NTV Telugu Site icon

Road Accident: వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి..!

Road Accident

Road Accident

వరంగల్ జిల్లా మామునూరు ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనుప రాడ్ల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఆటోలు, ఒక కారుపై ఇనుప స్తంభాలు పడ్డాయి. దీంతో ఇనుప రాడ్ల కింద ఆటో ఉండటంతో ఎంత మంది చనిపోయారు అనే దానిపై స్పష్టత లేదు.. మరోవైపు ఈ ప్రమాదంలో సుమారు ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇనుప రాడ్ల కింద ఉన్న రెండు ఆటోలు బయటకు తీస్తే అందులో ఇంకెంతమంది ఉన్నారనే విషయం బయటపడుతుంది. కాగా.. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు.