NTV Telugu Site icon

Gang War : గ్యాంగ్ వార్‌గా మారిన వాలీబాల్ బెట్టింగ్

Vollyball

Vollyball

వాలీబాల్ బెట్టింగ్ గ్యాంగ్ వార్ కు కారణంగా మారింది. బెట్టింగ్ లో రాజుకున్న వివాదంతో ఓ యువకుడిపై 20 మంది యువకులు దాడికి చేసి చితకబాదారు.. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ టౌన్ లో చోటు చేసుకుంది. బాధిత యువకుడు సుమన్ తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ లకు ఫిర్యాదు చేశాడు. మిర్యాలగూడ మండలం దిలావర్ పూర్ గ్రామం వాలీబాల్ గేమ్ లో బెట్టింగ్ వివాదానికి కారణం కాగా.. రెండు గ్రూపుల మధ్య ఘర్షణ మిర్యాలగూడ పట్టణంలో చోటుచేసుకుంది.. బాధిత యువకుడు ఓ ఫార్మసీ షాప్ లో పనిచేస్తుండగా బయటికి పిలిపించిన గ్యాంగ్ అతన్ని చితకబాదింది. రెండు రోజుల క్రితం యువకుల మధ్య ఘర్షణ జరగగా… రోడ్డుపై యువకులు కొట్టుకున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..