Basara IIIT: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని లిఖిత మృతిపై బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. లిఖిత నాలుగో ఫ్లోర్ నుంచి కింద పడుతున్నప్పుడు ఏం జరిగిందో విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. హాస్టల్ లోని నాల్గవ ఫ్లోర్ నుంచి ప్రమాదవసాత్తు విద్యార్థిని లిఖిత పడిపోయిందని వార్తులు వచ్చాయి. అయితే ఈ క్రమంలో అలిఖత కిందికి పడి పోతున్న క్రమంలో మూడవ ఫ్లోర్ వద్ద చిక్కుకుంది. లిఖిత వేలాడుతూ కాపాడండి అంటూ అరిచింది. దీంతో కాపాడండి అంటూ అరుపులు వినపడటంతో విద్యార్థినికులు భయాందోళనకు గురయ్యారు.
Read also: Perni Nani Vs Pawan Kalyan: మాకు లేవా చెప్పులు..? రెండు చెప్పులు చూయించిన నాని..
ఎక్కడి నుంచి ఈ అరుపులు వస్తున్నాయె మెల్లగా బయటకు రాగా.. విద్యార్థినిలకు లిఖిత మూడో ఫ్లోర్ వేలాడుతూ కనిపించింది. విద్యార్థినులకు ఎలా కాపాడాలో ఏమీ అర్థంకాలేదు. లిఖిత కాపాడండి అని దీనంగా ఏడుస్తూ అరుస్తున్నా నిర్ఘాంతపోయి చూసారే తప్పా ఏమీ చేయలేకపోయారు మిగతా విద్యార్థినులు. మూడో ఫ్లోర్ రో చిక్కుకున్న లిఖిత అక్కడి నుంచి కిందికి పడిపోయింది. అక్కడ వున్న విద్యార్థినులు కళ్ళ ముందే లిఖిత కిందపడిపోవడంతో విద్యార్థినిలు అక్కడే వున్న సిబ్బందికి సమాచారం అందించారు. అయితే కింద పడ్డా లిఖిత నొప్పిగా ఉందంటూ బాధపడుతున్న ఎవరూ ఏమీ చేయలేక పోయారు. లిఖిత కింద పడిన తరువాత దాదాపు 20 నిమిషాలకు ట్రిపుల్ ఐటీ నుంచి అంబులెన్సు లో భైంసా కు తరలించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 20 నిమిషాల ముందే లిఖితకు వైద్యం అందించి ఉంటే లిఖిత బతికేదని విద్యార్థినులు చెబుతున్నారు. అసలు లిఖిత ఎందుకు నాలుగో ఫ్లోర్ వెళ్లిందో అర్థం కావడం లేదని అంటున్నారు.
వైసీపీ స్పందన..
ట్రిపుల్ ఐటీ విద్యార్థిని లిఖిత మృతిపై వీసీ వెంకటరమణ స్పందించారు. ప్రమాదవశాత్తు లిఖిత మృతి చెందినట్లు అన్నారు. లిఖిత ఫోన్ చూస్తుండగానే భవనంపై నుంచి జారిపడిందని చెప్పాడు. ప్రమాదంలో లిఖిత వీపు భాగం దెబ్బతిందని తెలిపారు. విద్యార్థుల మృతి బాధాకరమని వీసీ వెంకటరమణ అన్నారు. మరోవైపు ట్రిపుల్ ఐటీ వీసీ జిల్లా ఆస్పత్రికి చేరుకుని విద్యార్థి లిఖిత మృత దేహాన్ని పరిశీలించారు. అయితే ఆస్పత్రికి వచ్చిన వీసీని లఖిత కుటుంబ సభ్యులు నిలదీశారు. మీ నిర్లక్ష్యం వల్లే పిల్లలు చనిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
House Rates: హైదరాబాద్లో పెరిగిన ఇళ్ల ధరలు