Site icon NTV Telugu

KTR : మహిళలకు ఉచితం, మగవారికి భారం..? కేటీఆర్ ఫైర్

Ktr

Ktr

KTR : తెలంగాణలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల ఆర్థిక స్థితిని పట్టించుకోకుండా ప్రభుత్వం చార్జీలు పెంచడం అన్యాయం అని ఆయన విమర్శించారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోందని, కానీ అదే సమయంలో పురుషులు, విద్యార్థులపై అదనపు భారాన్ని మోపుతోందని కేటీఆర్ మండిపడ్డారు. “ఇంట్లో ఒక మహిళ ఉచితంగా ప్రయాణం చేస్తే, కుటుంబంలోని మిగిలిన సభ్యులందరికీ రెండింతలు చార్జీలు కట్టాల్సి వస్తోంది. దీంతో ఒక కుటుంబానికి నెలకు కనీసం ఇరవై రూపాయల వరకు అదనపు భారం పడుతోంది. ఈ విషయం ఇప్పుడు ప్రతి తెలంగాణ కుటుంబానికీ అర్థమైంది” అని ఆయన అన్నారు.

Suside: ఇద్దరు పిల్లలకి విషమిచ్చి.. ఆపై ఆపై ఆత్మహత్య చేసుకున్న తండ్రి

కేటీఆర్ మాట్లాడుతూ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే పథకం ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించినట్టు ప్రభుత్వం చెబుతుందేమో కానీ, వాస్తవానికి ఇది ఆర్థిక సమతుల్యతను దెబ్బతీసే నిర్ణయమని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సమయంలో ఈ విధంగా వసూళ్లను పెంచడం ప్రజలపై నేరుగా భారం మోపడం అవుతుందని ఆయన అన్నారు.

ఆర్టీసీని బలోపేతం చేయాలనే ఉద్దేశం ఉన్నా, అది ప్రజల వెన్నుపైన భారం మోపడం ద్వారా సాధ్యం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తన ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ప్రయాణికులను బలితీసుకుంటోందని ఆయన ఆరోపించారు. “ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం మానేసి, ప్రచారపరమైన పథకాల పేరుతో బడ్జెట్ నష్టాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలతో మోసం చేయడమే” అని కేటీఆర్ అన్నారు.

బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ అంశంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, చార్జీల పెంపును తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల జీవన వ్యయాలు ఇప్పటికే పెరిగిపోయాయని, ఇలాంటి చర్యలు సాధారణ కుటుంబాలపై మరింత భారం మోపుతాయని వారు పేర్కొన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలతో ఆర్టీసీ చార్జీల పెంపు అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చావిషయంగా మారింది.

Vizag CP: అందుకే.. వైఎస్ జగన్‌ పర్యటనకు అనుమతి ఇవ్వలేం!

Exit mobile version