TRS Public Notice: టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మారుస్తూ టీఆర్ఎస్ పార్టీ పబ్లిక్ నోటీసు ఇచ్చింది. అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో ఎన్నికల కమిషన్కి తెలపాలని నోటీసులో పేర్కొంది. పార్టీ ప్రెసిడెంట్ పేరుతో ఈ ప్రకటన వెలువడింది. అయితే.. ఈ ఏడాది అక్టోబర్ 5 దసరా పండుగ రోజున టీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయం తెలిసిందే.. పార్టీ కార్యకలాపాలను జాతీయ స్థాయిలో విస్తరించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
అయితే.. ఈమేరకు పార్టీ నియమావళిలో మార్పులు చేశామని స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో.. పార్టీ పేరు మార్పునకు సంబంధించిన సమాచారాన్ని కొన్ని రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. ఈ సందర్బంగా.. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ రాజ్యాంగంలో చేసిన సవరణలకు జనరల్ బాడీ సమావేశం ఆమోదం తెలిపింది. అయితే.. ఈరోజు టీఆర్ఎస్ నోటీసుతో ఎలా స్పందన రానుందో వేచి చూడాలి.
Delhi liquor scam: లిక్కర్ స్కామ్ కేసులో ట్విస్ట్.. అప్రూవర్గా మారిన దినేష్ అరోరా..
