Site icon NTV Telugu

తెలంగాణలో కొత్త‌గా 3 ఒమిక్రాన్ కేసులు న‌మోదు

తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమ క్ర‌మంగా పెరిగి పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం లో కొత్త‌గా 3 ఒమిక్రాన్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 41 కి ఒమిక్రాన్ కేసుల సంఖ్య చేరింది. ఇవాళ ఒమిక్రాన్ వ‌చ్చిన ముగ్గురు వ్య‌క్తులు… విదేశాల నుంచి వ‌చ్చిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈ ముగ్గురు ఇంకా ఎవ‌రినైనా క‌లిసారా.. అనే దానిపై వైద్య అధికారులు ఆరా తీసుకున్నారు.

https://ntvtelugu.com/restrictions-on-new-year-celebrations-in-telangana/

ఇది ఇలా ఉండ‌గా..తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఇయర్‌ వేడుకల పై ఆంక్షలు విధించింది కేసీఆర్ స‌ర్కార్‌. హై కోర్టు ఆదేశాలతో ఆంక్షలు విధించింది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ్టి నుంచే జనవరి 2వ‌ వరకు ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్‌ సర్కార్. డిసెంబర్ 31 నుండి జనవరి 2 వరకు ర్యాలీ లు , బహిరంగ సభలు నిషేధిస్తూ… ఉత్త‌ర్వులు జారీ చేసింది ప్ర‌భుత్వం.

Exit mobile version