తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 4,693 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,16,404 కి చేరింది. ఇందులో 4,56,620 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 71,221 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 33 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,867 కి చేరింది. కరోనా బులెటిన్ ప్రకారం ఈ ఒక్కరోజు రాష్ట్రంలో 6,876 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.