NTV Telugu Site icon

తెలంగాణ కరోనా అప్‌డేట్‌

COVID

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు మరింత తగ్గాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 1,05,186 మంది సాంపిల్స్‌ పరీక్షించగా… కొత్తగా 784 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది.. మరో ఐదుగురు కోవిడ్‌ బాధితులు మృతి చెందారు. ఇదే సమయంలో 1,028 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,28,282కు చేరగా.. ఇప్పటి వరకు 6,13,124 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ఇక, ఇప్పటి వరకు 3,703 మంది మృతిచెందారు.. రాష్ట్రంలో ప్రస్తుతం 11,455 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.