తెలంగాణ కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,20,213 శాంపిల్స్ పరీక్షించగా.. 647 మందికి పాజిటివ్గా తేలింది.. మరో నలుగురు కోవిడ్ బాధితులు మృతిచెందగా.. తాజాగా 749 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,40,659 కు చేరుకోగా.. ఇప్పటి వరకు కరోనాతో 3780 మంది మృతిచెందారు.. 6,27,254 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. రాష్ట్రంలో రికవరీ రేటు 97.90 శాతంగా ఉందని బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం.
తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా.. 24 గంటల్లో 647 కేసులు
