NTV Telugu Site icon

టీవీ ప్రేక్షకులకు షాక్‌..

ఈ డిసెంబర్‌ నుంచి డీటీహెచ్‌ ఛార్జీలు భారీగా పెంచే దిశగా ఆయా నెట్‌వర్క్‌ కంపెనీలు తెలిపాయి. న్యూటారీఫ్‌ ఆర్డర్‌2.0(NTO)లో భాగంగా జీ, స్టార్‌, సోనీ, వైకామ్‌ వంటి18 సంస్థలు అందించే ఛానళ్ల ప్యాకేజ్‌ నుంచి తీసివేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో టీవీ ప్రేక్షకులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. అదనంగా35 నుంచి50 శాతం మేర ఛార్జీల మోత మోగనుంది. 2017 ట్రాయ్‌ ఎన్‌టీఓ పాలసీని తీసుకు వచ్చింది. ఎన్‌టీఓ2.0తో టీవీ ప్రేక్షకులు తమకు నచ్చిన ఛానల్‌ ఛార్జీలను మాత్రమే చెల్లించే అవకాశం ట్రాయ్‌ కల్పించింది. కాగా ట్రాయ్‌ తెచ్చిన ఎన్‌టీఓ పాలసీ 2.0తో పలు నెట్‌ వర్క్‌ కంపెనీలకు భారీగా నష్టం వాటిల్లుతోంది. దీంతో అత్యధిక ప్రాచుర్యం పొందిన ఛానళ్లను బండిల్‌ ఆఫర్ల నుంచి తీసవేయాలని నెట్‌వర్కింగ్‌ కంపెనీలు యోచిస్తున్నాయి. దీంతో తమకు కావాల్సిన ఛానల్‌ను వీక్షించాలంటే సగటు ప్రేక్షకుడు అదనంగా చెల్లించి ఆ ఛానల్‌ ప్రసారాలు పొందాల్సి ఉంటుంది.