Site icon NTV Telugu

PM MODI: హైదరాబాదులో అడుగు పెట్టిన ప్రధాని.. పాలమూరుకు పయనం

Pm Modi Palamur Visit

Pm Modi Palamur Visit

PM MODI: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు అధికారులు స్వాగతం పలికారు. ఈరోజు మధ్యాహ్నం 01:05 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనుంది. అయితే ప్రధాని మధ్యాహ్నం 01:30 గంటలకు వస్తారని సమాచారం అందింది. అయితే ప్రధాని మోదీ మధ్యాహ్నం 01:40 గంటలకు శంషాబాద్ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం 1:47 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి మహబూబ్‌నగర్‌కు బయలుదేరారు.

ప్రధాని మహబూబ్ నగర్ శంషాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరారు. తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా రూ. 13,500 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. అనంతరం మహబూబ్‌నగర్‌లో జరిగే బీజేపీ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పాలమూరు నుంచే ప్రధాని మోదీ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. నిన్న మోడీ తెలంగాణ పర్యటనపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు చేశారు. ఇవాళ మహబూబ్ నగర్ లో జరగనున్న సభలో ప్రధాని మోదీ ఎలాంటి విమర్శలు చేస్తారోనని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా చూస్తున్నారు. పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని, కృష్ణా జలాల వాటాపై కేంద్రం లెక్కలు వేస్తోందని బీఆర్ఎస్ సర్కార్ విమర్శించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రధాని మోదీ పర్యటనకు కేసీఆర్ మరోసారి దూరంగా ఉన్నారు. ప్రధాని మోదీకి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు.
Telangana Govt: అంగన్‌వాడీలకు దసరా కానుక.. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా..

Exit mobile version