Site icon NTV Telugu

Pocharam Srinivas Reddy: చరిత్ర తిరగరాసిన పోచారం.. స్పీకర్‌గా ఉండీ కూడా విజయం..

Pocharam Srinivas Reddy

Pocharam Srinivas Reddy

Pocharam Srinivas Reddy: చరిత్రను తిరగరాస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం సాధించారు. బాన్సువాడ నుంచి పోచారం 23,582 ఓట్లతో గెలిచారు. స్పీకర్ గా ఉంటూ విజయం సాధించడం చాలా అరుదు. కానీ ఈ సంప్రదాయాన్ని ఆయన తిరగరాశారు.

అంతకుముందు తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న మధుసూదనాచారి 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. భూపాలపల్లి నియోజవర్గం నుంచి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి అయిన గండ్ర వెంకటరమణా రెడ్డి చేతిలో పరాజయం చవి చూశారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో భాగంగా గండ్ర బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Read Also: BJP Victory: బీఆర్ఎస్ మంత్రికి షాక్.. బీజేపీ అభ్యర్థి గెలుపు

అయితే స్పీకర్ గా ఉన్న వ్యక్తులు ఎక్కువగా శాసనసభ కార్యకలాపాలపైనే దృష్టి పెడతారని, నియోజవర్గానికి అందుబాటులో ఉండరనే ఆరోపణ ఉంది. స్పీకర్‌గా ఉండే వ్యక్తి అధికార, ప్రతిపక్షాల మధ్య సమన్వయం చేస్తుంటారు, ఏ ఒక్క పార్టీకి కొమ్ముకాయకుండా ఉండాలి. స్పీకర్ గా ఉన్న వ్యక్తి తన నియోజకవర్గంలో తాను గెలిచిన పార్టీని రిప్రజెంట్ చేయలేరు. దీంతోనే సాధారణంగా స్పీకర్‌గా ఉన్న వ్యక్తి తర్వాత ఎన్నికల్లో గెలవడని చెబుతుంటారు. కానీ ఈసారి పోచారం దానికి చెక్ పెట్టారు.

Exit mobile version