NTV Telugu Site icon

Ration Card E- KYC: రేషన్‌ కార్డుల ఈ-కేవైసీ గడువు.. మరో నాలుగు రోజులే ఛాన్స్..

Ration Card E Kyc

Ration Card E Kyc

Ration Card E- KYC: తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువు కూడా దగ్గర పడుతోంది. ఇక మిగిలింది నాలుగు రోజులు మాత్రమే. జనవరి 31తో గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఎవరైనా ఈకేవైసీ అప్‌డేట్ చేయకపోతే వెంటనే చేయాలని అధికారులు సూచిస్తున్నారు. మరోసారి గడువు పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది. గత రెండు నెలలుగా రేషన్ షాపుల్లో E-KYC అప్‌డేట్ చేయబడుతోంది. KYC అప్‌డేట్ కోసం ఆధార్ ధృవీకరణ మరియు వేలిముద్రలు సేకరిస్తున్నారు. రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం కాకపోతే వెంటనే చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ-కేవైసీ పూర్తి కాకపోతే రేషన్ సరుకులను తగ్గించే అవకాశం ఉంది. దీంతో రేషన్ లబ్ధిదారులు జనవరి 31లోగా తమ రేషన్ కార్డు, ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయాల్సి ఉంటుంది.

Read also: Emmanuel Macron: హెలికాప్టర్లు, జెట్ ఇంజన్ల నుంచి అంతరిక్షం వరకు… భారత్, ఫ్రాన్స్ మధ్య ఒప్పందాలివే

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తోంది. కానీ బోగస్‌ రేషన్‌ కార్డులను ఆధార్‌ నంబర్‌తో రేషన్‌ కార్డుతో అనుసంధానం చేయాలని ఎరివేత సంస్థ నిర్ణయించింది. దీనికి కారణాలు లేకపోలేదు. చాలా పాత కార్డుల్లో చనిపోయిన వారి పేర్లే ఉన్నాయి. దీంతో రేషన్ సరుకులు పక్కదారి పడుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు ఈకేవైసీ ప్రక్రియను తెరపైకి తెచ్చారు. కుటుంబంలో చాలా మంది లబ్ధిదారులు ఉంటే, వారందరూ EKYC చేయాలి. మరోవైపు కొత్త రేషన్ కార్డుల ఆమోదానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నారు. కానీ EKYC పూర్తయిన తర్వాత… లబ్ధిదారుల విషయంలో మరింత స్పష్టత రానుంది. ఈ డేటాను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ ప్రక్రియ పూర్తయితే… కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ వేగవంతం కానుంది.

Read also: Dharani Committee: సచివాలయంలో మరోసారి ధరణి కమిటీ సమావేశం.. పలు సమస్యలపై చర్చ

KYCని ఎలా అప్‌డేట్ చేయాలి?

* రేషన్ కార్డ్ KYCని అప్‌డేట్ చేయడానికి, రేషన్ కార్డు యొక్క కుటుంబ సభ్యులందరితో పాటు కుటుంబ యజమాని రేషన్ దుకాణానికి వెళ్లి వారి వేలిముద్రలను ఈ పాస్ మిషన్‌లో వేయాలి.

* విడివిడిగా రేషన్‌కార్డు దుకాణానికి వెళితే ప్రాసెస్‌ చేయలేరు.

* వేలిముద్రలు తీసుకున్న తర్వాత ఈ-పాస్‌పై లబ్ధిదారుడి ఆధార్ కార్డు నంబర్, రేషన్ కార్డు నంబర్ డిస్‌ప్లే అవుతుంది.

* ఇ-పాస్ మిషన్‌లో, గ్రీన్ లైట్ వస్తుంది మరియు EKYC అని వస్తుంది.

* ఒకవేళ రెడ్ లైట్ ఆన్‌లో ఉంటే లబ్దిదారుడి రేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు సరిపోలడం లేదని అర్థం. దీంతో ఆ రేషన్‌ కార్డును తొలగిస్తారు.

* రేషన్ కార్డులో పేర్లు ఉన్న వారందరూ ఒకేసారి EKYC అప్‌డేట్ చేసుకోవాలి.
BC Janardhan Reddy: బనగానపల్లె జయహో బీసీ కార్యక్రమంలో వైసీపీపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి ఫైర్..!