అక్కడ దేశభక్తి కొండంత.. రోజూ జనం నోట జనగణమన

ఆగస్టు 15, జనవరి 26వ తేదీ వచ్చిందంటే చాలు మనలో చాలామందికి దేశభక్తి పొంగిపొరలుతుంది. సోషల్ మీడియాలో దేశభక్తి వెల్లువలా మెసేజ్ లు, స్టాటస్ ల రూపంలో కనిపిస్తుంది. కానీ నిత్యం తమలోని దేశభక్తిని చాటుకుంటూ తమ విలక్షణతను అందరికీ తెలియచేస్తున్నారు కొందరు దేశభక్తులు.

ఇలాంటి అరుదైన ఘటన నిత్యం ఒక జిల్లాలో కనిపిస్తుంది. అది కూడా తెలంగాణలోనే వుండడం గమనార్హం. తెలంగాణకు మకుటాయమానంగా మారిన ఆ జిల్లా వేరే ఏదీ కాదు. పోరాటాల ఖిల్లా.. నల్లగొండ జిల్లా. అక్కడ ఉదయం 8.30 అయిందంటే చాలు అందరి చేతులు భరతమాతకు సెల్యూట్ చేస్తుంటాయి. నల్లగొండ టౌన్ లోని 12 ప్రధాన జంక్షన్లలో ఉదయం జనగణమన వినిపిస్తుంది. ఏ పనిచేసేవారైనా 52 సెకండ్ల పాటు నిలబడి పోతారు. దేశభక్తిని చాటుకుంటారు. పౌరులంతా జాతి, మత, కులం, వర్గం తేడా లేకుండా జనగణమన పాడతారు. ఈ ఏడాది జనవరి 23 నుంచి ఈ సంప్రదాయం అక్కడ ప్రారంభమయింది. ఈ సంప్రదాయాన్ని జనగణమన ఉత్సవ సమితి ప్రెసిడెంట్ కర్నాటి విజయ్ కుమార్ ప్రారంభించారు. ఆయనకు అనేకమంది మిత్రులు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు.

×
×
Ad

ప్రతి రోజూ జనగణమన ఆలపిస్తున్న వీరిని పలువురు అభినందిస్తున్నారు. ఇలా జనగణమన పాడడం దేశభక్తికి నిదర్శనం అనీ కర్నాటి విజయ్ కుమార్ అంటున్నారు. ఈ పద్ధతిని నల్లగొండలోని ఇతర పట్టణాల్లోనూ అనుసరిస్తున్నారు. 2020లో గాల్వాన్ వ్యాలీలో చైనాతో జరిగిన ఘర్షణల్లో నేలకొరిగిన అర జవాన్, భరత మాత ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు జన్మించిన ప్రాంతం కూడా నల్లగొండ కావడం విశేషం.

https://ntvtelugu.com/sri-ramanuja-millennium-celebrations/