Revanth Reddy: సీఎం హోదాలో తొలిసారి సొంతూరుకు రేవంత్ రెడ్డి.. గ్రామస్తులతో కలిసి దసరా వేడుకలు
- నేడు సొంతూరు కు సిఎం రేవంత్ రెడ్డి పర్యటన..
- కొండా రెడ్డి పల్లిలో దసరా పండుగ వేడుకలు జరుపుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి..
- సీఎం రేవంత్ రెడ్డి హోదాలో తొలిసారి సొంత గ్రామానికీ..
- గ్రామస్తులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొననున్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: నేడు సొంతూరు కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్నున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండా రెడ్డి పల్లిలో దసరా పండుగ వేడుకలు సీఎం రేవంత్ రెడ్డి జరుపుకోనున్నారు. సీఎం హోదాలో తొలిసారి సొంత గ్రామానికీ వెళ్లనున్నారు. సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కొండారెడ్డి పల్లి గ్రామానికి చేరుకోనున్నారు. గ్రామస్తులతో కలిసి దసరా వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. కోట్ల రూపాయల నిధులతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. నూతన గ్రామ పంచాయతీ, బీసీ భవనం, గ్రంథాలయం, పశువైద్య శాలలను ప్రారంభోత్సవం చేయనున్నారు. సౌర విద్యుత్ ఆధారిత గ్రామంగా తీర్చి దిద్దేందుకు ఏర్పాట్లు చేశారు. నాలుగు కోట్ల రూపాయల సొంత నిధులతో హనుమాన్ దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి వస్తుండటంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
Read also: Heavy Rains: తుఫాన్పై వాతావరణ శాఖ హెచ్చరిక.. ఏపీతోపాటు తెలంగాణకు భారీ వర్షాలు
Also Read
- ACB Raids : ఏసీబీకి చిక్కిన ఎస్సై.. సంబరాలు చేసుకున్న గ్రామస్థులు..
- Ragging: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. గతేడాది బాధితుడే.. నేడు నిందితుడు..!
- Karthika Pournami: శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివాలయాల్లో భక్తుల పూజలు..
- Srisailam Ghat Road: శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడుతున్న కొండచరియలు..
శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం..
కొండారెడ్డి పల్లి గ్రామంలో రూ.50 కోట్ల నిధులతో అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి శంకుస్థాపన చేయనున్నారు. బీసీ కమ్యూనిటీ హాల్ కొత్త గ్రామ పంచాయతీ, వెటర్నరీ మెడిసిన్ భవనం, కొత్త గ్రంథాలయ భవనం, ఆధునిక రైతు వేదిక, ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ తదితర అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అలాగే గ్రామంలో అండర్ డ్రైనేజీ, నాలుగు లైన్ల రోడ్డు, సెంటర్ లైటింగ్, చిల్డ్రన్స్ పార్క్, జిమ్, దేవాలయం తదితర వాటికి సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ ప్రాంతం, గ్రామంలో పర్యటన జరిగే ప్రదేశాలను ముందస్తుగా పోలీసుల ఆధీనంలోకి తీసుకుంటారు. సీఎంను కలిసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే అవాంఛనీయ సంఘటనలు, ఇతర సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ మేరకు పోలీసులకు తగు సూచనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ తిరిగి హైదరాబాద్ వెళ్లేంత వరకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
Dussera 2024: దశమికి జమ్మి చెట్టుకి ఉన్న సంబంధం ఏమిటి..?
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..