MP Santosh Kumar : తాత బాటలోనే మనవడు హిమాన్షు..

Kalvakuntla Himanshu

Kalvakuntla Himanshu

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్‌ మనవడు, మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ తో కలిసి మొక్కలు నాటారు. అయితే.. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో ఎందరో పాల్గొన్నారు. అయితే తాజాగా తన బర్త్‌డే సందర్భంగా హిమాన్షు మొక్కలు నాటారు. అయితే ఆయన పాటు సంతోష్‌ కుమార్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్ఱర్‌ వేదికగా పంచుకున్న ఎంపీ సంతోష్‌ కుమార్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. . హిమాన్షు కూడా త‌న తాత కేసీఆర్ బాట‌లోనే న‌డుస్తున్నార‌ని హ‌రిత హారంతో తెలంగాణ‌ను స‌శ్య‌శ్యామలం చేసే దిశ‌గా హ‌రిత హారం ప్రాజెక్టుకు కేసీఆర్ పునాది వేస్తే… తాను కూడా ఆ దిశ‌గానే సాగుతాన‌ని బ‌ర్త్ డే నాడు హిమాన్షు మొక్క నాటార‌ని పేర్కొన్నారు సంతోష్‌ కుమార్‌.