Telangana Temple: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆంజనేయస్వామి ఆలయంలో పండితులు వేదపండితులు ఆశీర్వదించారు. ఆలయ అధికారులు స్వామివారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేదపండితులు, అధికారులు స్వాగతం పలికారు. టీఎస్ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి ఆమె ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే హనుమాన్ చాలీసా పారాయణంలో కూడా ఆమె పాల్గొంటారు. మధ్యాహ్నం జగిత్యాల పట్టణంలోని బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read also: Metro Train : ఛండాలం.. ఇది మెట్రోరా.. పార్క్ కాదు.. ఇంత బరితెగించారేంట్రా
భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం భద్రాద్రికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో పండితులు వేదపండితులు ఆశీర్వదించారు. ఆలయ అధికారులు స్వామివారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు రాములవారి క్షేత్రానికి వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వేదపండితులు, అధికారులు స్వాగతం పలికారు. పర్యటన అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పురుషోత్తమపట్నంలోని భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆస్తులు, పరువును కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. భూమి ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే అక్కడ ఉన్న ఆక్రమణల నిర్మాణాలను కూల్చివేసినట్లు వెల్లడించారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెంట ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. గోసేవలో మంత్రితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Metro Train : ఛండాలం.. ఇది మెట్రోరా.. పార్క్ కాదు.. ఇంత బరితెగించారేంట్రా