Site icon NTV Telugu

మాయమాటలు చెప్పేవారిని నమ్మవద్దు : మంత్రి వేముల

నిజామాబాద్ భీమ్ గల్ టీఆర్ఎస్ బహిరంగ సభ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… నిరయోజకవర్గ భివృద్ధిపనులు వేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత ఆలోచన కృషి వల్లనే భీంగల్ మ్యూనిసిపాలిటీగా మరి అభివృద్ధిపతంలో నడుస్తోంది. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో భీంగల్ పట్టణం ప్రగతి సాధిస్తోంది. కెసీఆర్ ను కడుపులో పెట్టుకుంటున్న గ్రామాలను అభివృద్ధి చేసే భాద్యత మాదే అని తెలిపారు. తెలంగాణ లో అమలయ్యే సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలౌతాలేవు. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న నెలరాష్ట్రలో ఇలాంటి సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేస్తాలేరో అని ప్రశ్నించారు. ఇక ఈ మాయ మాటలు చెప్పేవారిని నమ్మవద్దని విజ్ఞప్తి చేసారు మంత్రి వేముల.

Exit mobile version