Site icon NTV Telugu

నకలీ భూ ప్రతాలు సృష్టించి మోసానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్‌…

ఓ కంపెనీకి సంబంధించి నకిలీ భూ పత్రాల సృష్టించి మోసానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేఖర్‌ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని మూసాపేటలో గల ఓ కంపెనీకి చెందిన స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించాడు.

1500 గజాల స్థలానికి ఫేక్‌ పత్రాలు సృష్టించి ఆ స్థలానికి అమ్ముతానంటూ.. ఓ వ్యక్తి దగ్గరి నుంచి రూ.1.10 కోట్ల రూపాయల అడ్వాన్స్‌ తీసుకున్నాడు.

నకిలీ పత్రాలుగా గుర్తించిన బాధితుడు.. మోస పోయినట్లు గ్రహించి వెంటనే పోలసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version