TPCC Working President Mahesh Kumar Goud says Sarvodaya Padayatra Starts from Tomorrow.
రేపు ఉదయం భూదాన్ పోచంపల్లి నుంచి మాజీ ఎంపీ రాజీవ్ గాంధీ, పంచాయతీ రాజ్ సంఘటన్ చైర్మన్ మీనాక్షి నటరాజన్ సర్వోదయా పాదయాత్ర ప్రారంభం అవుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. 26 రోజుల పాటు తెలంగాణలో యాత్ర జరుగుతుందని, మహారాష్ట్ర లోని వార్ధా వరకు ఈ పాదయాత్ర ఉంటుందని ఆయన పేర్కొన్నారు. భూదాన్ పోచంపల్లి వినోదాబావే భూ దాన్ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించారని, 75 ఏళ్ళు అయిన సందర్భంగా ఈ యాత్ర ఇక్కడ నుంచి ప్రారంభిస్తారన్నారు.
ఈ యాత్రలో ఒక రోజు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొంటారని, ప్రతి రోజు పాదయాత్రలో కాంగ్రెస్ నాయకులు వెంట ఉండి యాత్రలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ప్రధానంగా పేదల భూ సమస్యలు పరిష్కరించాలని ఈ యాత్ర చేపట్టడం జరిగుతోందని, రేపు ఉదయం ఈ యాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొంటారని ఆయన ప్రకటించారు. శనివారం నాడు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఆదివారం నాడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు.
