NTV Telugu Site icon

MLA Lakshmareddy: అమ్మాపూర్‌లో లక్ష్మారెడ్డి ప్రచారం.. బీఆర్‌ఎస్‌లో చేరిన 150 మంది నాయకులు

Mla Lakshmareddy

Mla Lakshmareddy

MLA Lakshmareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నవాబుపేట మండలం అమ్మాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి జడ్చర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలను ఆరా తీస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంతటి అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్న కేసీఆర్ సర్కార్ కి మద్దతు తెలుపాలని కోరారు. రేపు నవంబర్ 30వ తేదినా జరుగబోయే ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని లక్ష మెజారిటీ తో గెలిపించాలని లక్ష్మారెడ్డి ప్రజలను కోరారు. ప్రచారంలో భాగంగా.. ఇవాళ నవాబుపేట మండలం అమ్మాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటించారు.

ఉదయం నుంచి ప్రజలతో మమేకమై బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని వివరిస్తూ సాగుతున్నారు. ఈనేపథ్యంలో.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 150 మంది నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు చంద్రప్రకాష్ రెడ్డి, రామకృష్ణరెడ్డి, సిద్ధిరాంరెడ్డి, ఆంజనేయులు.. కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకి చెందిన నాయకులందరికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి అమ్మాపూర్ గ్రామం తరుపున పూర్తి మద్దతునిస్తూ కారుగుర్తుకు ఓటువేసి లక్షఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

మరోవైపు బాలానగర్ మండలం చింతకుంట తండాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తండాకు చెందిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు రవీందర్, వార్డు సభ్యులు రాజేశ్వరి, శ్రీనివాస్, రమేష్ సహా 100 మంది నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. నూతనంగా చేరిన వారందరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతన సభ్యులు మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి పూర్తి మద్దతునిస్తూ కారు గుర్తుకు ఓటువేసి లక్షఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
Huchamma Chowdhury: బడికోసం స్థలం దానమిచ్చి వృద్దురాలు ..నిస్వార్ధానికి రాజ్యోత్సవ అవార్డు..