Site icon NTV Telugu

నిజామాబాద్ లో విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని చందూర్ మండలం లక్ష్మాపూర్ అడవి ప్రాంతంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. చెట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు ప్రేమికులు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అంతేకాదు.. మోస్రామ్ మండలం తిమ్మాపూర్ కి చెందిన మోహన్,లక్ష్మి గా వారిని గుర్తించారు పోలీసులు. వారం రోజుల క్రితమే వారు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. అటు వారం నుండి చెట్లకి వేలాడుతూ మృతదేహాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version