Site icon NTV Telugu

తెలంగాణ‌లో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్

తెలంగాణ‌లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.. ఏకగ్రీవం అయిన స్థానాలు మినహా.. ఇవాళ నల్గొండ, ఖమ్మం, మెదక్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌లో మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ జరిగింది.. ఉదయం 8 గంటలకు నుంచి సాయంత్రం 4 గంట‌ల‌కు జరిగిన పోలింగ్‌లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది.. ప‌లు పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుండగా.. మొత్తంగా పోలింగ్ ముగిసే స‌మ‌యానికి 90 శాతానికి పైగా ఓట్లు పోల్‌ అయినట్టు చెబుతున్నారు.. తుది ఫలితాలు తెలియాలంటే మాత్రం ఈ నెల 14వ తేదీ వరకు వేచిచూడాల్సిందే.

Read Also: ఒకే ప్రేమ్‌లో ఎన్టీఆర్ అల్లుళ్లు.. నారా, దగ్గుబాటి సరదా ముచ్చట్లు..

కాగా, స్థానిక సంస్థల కోటాలో కరీంన‌గర్‌ జిల్లాలో రెండు స్థానా‌లకు, ఉమ్మడి మెదక్‌, ఆది‌లా‌బాద్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానా‌నికి ఇవాళ పోలింగ్‌ జరిగింది.. ఇక, పోలింగ్‌ ముగియడంతో.. బ్యాలెట్ బాక్స్ లను అభ్యర్థుల సమక్షంలో సీజ్ చేసి స్ట్రాంగ్ రూమ్ లకు తరలిస్తున్నారు సిబ్బంది.. మరోవైపు స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.. నిరంతరం సీసీ కెమెరాలతో పోలీస్ పహారా నిర్వహిస్తున్నారు.. ఈ నెల 14వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు అధికారులు.

Exit mobile version