Koti Deepotsavam 2025 Day 11 : అంగరంగ వైభవంగా తిరుత్తణి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య కల్యాణోత్సవం
- కోటి దీపోత్సవం పదకొండవ రోజు ఆధ్యాత్మిక అద్భుతం
- అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి కల్యాణోత్సవం
- చాగంటి ప్రవచనం, మహాస్వాముల ఆశీస్సులు
- భక్తులతో కళకళలాడిన ఎన్టీఆర్ స్టేడియం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2025 Day 11 : కార్తీకమాసం పర్వదినాల్లో భాగంగా ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవం 2025 పదకొండవ రోజు కార్యక్రమాలు అద్భుత ఆధ్యాత్మిక వైభవంతో మెరిశాయి. ఎన్టీఆర్ స్టేడియం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడగా, వేలాది భక్తులు ఒకే స్వరంతో “ఓం నమః శివాయ” జపిస్తూ వెలిగించిన దీపాలు ఆ ప్రాంగణాన్ని దివ్యజ్యోతి ప్రదేశంగా మార్చేశాయి. ప్రతి దీపం ఆత్మజ్యోతి సందేశాన్ని అందిస్తూ భక్తుల హృదయాలను పరవశింపజేసింది. 2012లో ఆరంభమైన ఈ మహోత్సవం నేడు అంతర్జాతీయ స్థాయిలో ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుండటం నిజంగా గర్వకారణం.
ఈరోజు నిర్వహించిన విశేష కార్యక్రమాలు భక్తి తరంగాలను మరింతగా ఉద్ధరిస్తూ భక్తులని ఆధ్యాత్మికానందంలో ముంచాయి. ఎడ్నీర్ మఠాధీశ శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద భారతి మహాస్వామీజీ, శ్రీశైల జగద్గురు పూజ్యశ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్య మహాస్వామీజీ అందించిన అనుగ్రహ సందేశాలు ప్రతి భక్తుని హృదయంలో శాంతి, శివభక్తిని నింపాయి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనామృతం ఆధ్యాత్మిక జ్ఞానవర్షంలా కురిసి వేదికను పవిత్రంగా మార్చింది.
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
భక్తులు పాల్గొన్న నాగర్ కోయిల్ నాగేంద్ర పూజ, కావడి ఉత్సవం, కోటి పుష్పార్చన వంటి విశేషాలు వేదికను ఉత్సాహంతో నింపాయి. అత్యంత వైభవంగా నిర్వహించిన తిరుత్తణి శ్రీవల్లీ–దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కల్యాణోత్సవం భక్తుల్ని పరిపూర్ణ ఆనందంలో ముంచింది. అనంతరం స్వామివారు మయూరవాహనంపై దర్శనమిచ్చిన దృశ్యం భక్తుల హృదయాల్లో నిలిచిపోయే క్షణమైంది.
సాంస్కృతిక కార్యక్రమాలు, లింగోద్భవ దర్శనం, సప్తహారతుల అద్భుత క్షణాలు మొత్తం కార్యక్రమానికి సౌందర్యాన్ని, పవిత్రతను రెట్టింపు చేశాయి. ఈ రోజు కోటి దీపోత్సవం కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై మహోత్సవాన్ని ప్రశంసించడం వేడుకకు మరింత గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈ పవిత్ర దీపాల మహోత్సవం నవంబర్ 13 వరకు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ప్రతిరోజూ సాయంత్రం 5.30 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను శివానుభూతిలో ముంచేస్తాయి. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
Jubilee Hills Bypol Exitpolls : జూబ్లీహిల్స్లో కాంగ్రెస్దే గెలుపు అంటున్న ఎగ్జిట్ పోల్స్
శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కల్యాణోత్సవంలో దివ్య హారతి దర్శనం..#BhakthiTV #Kotideepotsavam2025 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam pic.twitter.com/E6wl6uMfsD
— BhakthiTV (@BhakthiTVorg) November 11, 2025
కోటి దీపోత్సవాన్ని రాష్ట్ర పండుగగా చేస్తాం : Minister Shri Ponguleti Srinivasa Reddy#PonguletiSrinivasaReddy #BhakthiTV #Kotideepotsavam2025 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam pic.twitter.com/k1Lqc258PY
— BhakthiTV (@BhakthiTVorg) November 11, 2025
Pics from Day-11 of #Kotideepotsavam2025#BhakthiTV #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2025 #కోటిదీపోత్సవం pic.twitter.com/UiAMlvSzj4
— BhakthiTV (@BhakthiTVorg) November 11, 2025
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!