NTV Telugu Site icon

Union Cabinet: కేంద్ర మంత్రి వర్గంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్..

Kishanreddy, Bandi Sanjay

Kishanreddy, Bandi Sanjay

Union Cabinet: ఎన్డీయే ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ప్రధాని కాబోయే నరేంద్ర మోడీ తన క్యాబినెట్ మంత్రులు, ఎంపీలకు మోడీ టీ పార్టీ ఏర్పాటు చేశారు. అలాగే మోడీ 3.0 కేబినెట్‌లోని కొత్త మంత్రుల నుంచి రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలకు కూడా ఇప్పటికే కాల్స్ వచ్చాయి. ఇందులో బీజేపీ మాజీ సీఎంలకు కూడా చోటు దక్కింది. అలాగే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి చోటు దక్కింది. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కిందని ఫోన్ చేశారు. ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోడీతో పాటు బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. అయితే వీరికి ఏయే శాఖలు కేటాయించారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Read also: Central Minister: రామ్మోహన్ నాయుడికి కేంద్రమంత్రి పదవి ఇస్తారా..?

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. 17 స్థానాలకు గాను 8 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మరి కేంద్రంలో మరోసారి ఎన్డీయే కూటమి అధికారం చేపట్టే అవకాశం ఉండటంతో తెలంగాణ నుంచి ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే.. కేంద్ర మంత్రి వర్గంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ చోటుదక్కింది. తెలంగాణలో గెలిచిన 8 మంది ఎంపీల్లో నాలుగు మంత్రి పదవుల రేసులో బండి సంజయ్ ముందు వరుసలో ఉన్నారు.. ఎందుకంటే గతంలో ఎంపీగా ఉన్న బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తెలంగాణలో బీజేపీ మరింత బలపడింది. అలాగే బండి ప్రజాసంగ్రామ యాత్రతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి హైప్ తీసుకొచ్చారు. గతంలో సంజయ్ బండికి కేంద్రమంత్రి పదవి ఇస్తారని పార్టీ శ్రేణుల ప్రచారం. అయితే ఏం జరిగినా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Saudi Arabia : హజ్ యాత్రికులకు అలర్ట్.. మక్కా, మదీనాలో ప్రార్థనల సమయం తగ్గింపు