NTV Telugu Site icon

Komrelly Mallanna: మల్లన్న మూలవిరాట్ దర్శనం రద్దు.. మళ్ళీ ఎప్పుడంటే..?

Komarivelli Mallanna

Komarivelli Mallanna

Komrelly Mallanna: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం జాతర త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జాతరకు సంబంధించి కొమురవెల్లి ఆలయ కమిటీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీ భావిస్తోంది. ఈ క్రమంలో జనవరి 1వ తేదీ నుంచి భక్తులకు కొమురవెల్లి మల్లికార్జున స్వామి మూల విరాట్ దర్శనాన్ని రద్దు చేస్తూ ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. సోమవారం (2024 జనవరి 1వ తేదీ) సాయంత్రం నుంచి మూలవిరాట్ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలూరు బాలాజీ వెల్లడించారు. జనవరి 7న కొమురవెల్లి మల్లన్న స్వామి కల్యాణంతో జాతర ప్రారంభమవుతుందని ఈవో ఆలూరు బాలాజీ తెలిపారు. ఈ సందర్భంగా వారం రోజుల పాటు కొమురవెల్లి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది గర్భగుడిలో స్వామి, అమ్మవార్ల విగ్రహాలను అలంకరించనున్నారు. ఈ మేరకు మూల విరాట్ దర్శనాలను నిలిపివేయాలని నిర్ణయించారు.

Read also: Gang War: వీరి దుంప తెగ.. రైల్వే ట్రాక్ పై కొట్టుకుని ప్రాణాలే పోగొట్టుకున్నారు కదరా..!

కొమురవెల్లి మల్లన్న ఈ నెల 31 రాత్రి నుంచి నిజ జీవిత దర్శనాలను నిలిపివేయాలని తొలుత భావించినట్లు తెలిపారు. అయితే కొత్త సంవత్సరం ప్రారంభంతోపాటు మరుసటి రోజు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని భావించి నిర్ణయం మార్చుకున్నట్లు వివరించారు. జనవరి 2వ తేదీ ఉదయం నుంచి మూలవిరాట్ దర్శనం కాకుండా అర్థమండపంలో విగ్రహాలకు పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గమనించిన భక్తులు దర్శనానికి రావాలని పిలుపునిచ్చారు. ఇక కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం వచ్చేనెల 7న జరగనుంది. ఈ వేడుకను తిలకించేందుకు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ కల్యాణానికి దాదాపు 40 వేల మంది హాజరవుతారని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ కల్యాణోత్సవం, జాతర సన్నాహాలను వారం రోజులుగా పూర్తి చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయ అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ప్రతిసారి స్వామివారి కల్యాణోత్సవానికి నెల రోజుల ముందు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు.
World’s Richest Women: ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ.. 100 బిలియన్ డాలర్ల విలువైన సామ్రాజ్యాధిపతి