రాచకొండ కమిషనరేట్ పరిధిలో అక్రమ సంబంధంతో ఓ యువకుడు బలైయ్యాడు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధి మల్లాపూర్ లో ఈ సంఘటన చోటుచేసుకొంది. నేహా అనే మహిళ సోయల్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోంది. గత రాత్రి భర్త లేని సమయంలో నేహా, సోయల్ ను ఇంటికి పిలిపించుకుంది. అదే సమయంలో భర్త ఇంటికి వచ్చాడు. భర్త మొయినుద్దీన్ భార్య నేహాను, ప్రియుడు సోయల్ గదిలో చూసి నిలదీయడంతో నేహా ప్లేట్ ఫిరాయించింది, సోయల్ నన్ను బలవంతం చేయబోయాడు అని చెప్పడంతో భార్యాభర్తలిద్దరూ కలిసి సోయల్ గొంతుకోసి హత్య చేశారు. అనంతరం భార్యాభర్తలిద్దరూ నాచారం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అక్రమ సంబంధం.. వివాహిత చేతిలో ప్రియుడి బలి
