Tension in Dubbaka: దుబ్బాకలో రచ్చ రచ్చ.. మూడు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట
- దుబ్బాకలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రచ్చ రచ్చ..
- స్టేజినుంచి కిందికి దిగి అసహనంతో వెళ్లిపోయిన చెరకు శ్రీనివాస్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tension in Dubbaka: దుబ్బాకలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రచ్చ రచ్చగా మారింది. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. మంత్రితో పాటు స్టేజిపైకి కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు. స్టేజీపైకి ఓడిపోయిన వారు రావద్దని, ప్రోటోకాల్ పాటించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు పట్టుబట్టారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆగ్రహంతో స్టేజీ పైనే శ్రీనివాస్ రెడ్డి ఉంటాడని ఆందోళన చేపట్టారు. అక్కడ మూడు పార్టీల కార్యకర్తలు పోటా పోటీ నినాదాలు చేపట్టారు. మూడు పార్టీల కార్యకర్తలు నినాదాలు, తోపులాటతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కళ్యాణలక్ష్మి చెక్కుల కోసం వచ్చిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాసేపు ఏం జరుగుతుందో అర్థంకానీ పరిస్థితిలో ఉండిపోయారు. దీంతో అక్కడ నినాదాలు, తోపులాటల మధ్య కార్యకర్తలను పోలీసులు నిలువరించేందుకు తంటాలు పడ్డారు. చివరకు చెరకు శ్రీనివాస్ రెడ్డి స్టేజినుంచి కిందికి దిగి అసహనంతో వెళ్లిపోయారు. సామరస్యంగా ఉండాలని చెక్కులు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. రసాభాసల మధ్య మంత్రి కొండా సురేఖ చెక్కులు పంపిణీ చేశారు.
Rajanna Siricilla: పాత వారికే రేషన్ డీలర్లు కేటాయించాలి.. పెట్రోల్ బాటిల్ తో నిరసన..
Also Read
తాజావార్తలు
-
72nd National Film Awards : 72వ జాతీయ అవార్డులపై విమర్శలు.. అద్భుతమైన సినిమాలకు నో అవార్డ్స్
-
Mammootty: నాలుగో జాతీయ అవార్డుతో చరిత్ర సృష్టించిన మమ్ముట్టి.. కమల్, చిరంజీవి, అల్లు అర్జున్ శుభాకాంక్షల వెల్లువ
-
PV Sindhu History: పీవీ సింధు సరికొత్త చరిత్ర.. తొలి భారత షట్లర్గా అరుదైన ఘనత!
-
FIFA World Cup 2026 Final: ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల ధరలు ఇవే.. ఒక్క సీటుకి రూ.22 కోట్లా?
-
Rohit Sharma Retirement: “దాంతో నాకేం సంబంధం”.. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!