Friends Rape: హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్పై గ్యాంగ్రేప్ జరిగింది. ఓ హోటల్లో యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
Read also: Srisailam Dam Gates Lifted: పెరిగిన వరద ఉధృతి.. శ్రీశైలం డ్యామ్ మరో రెండు గేట్లు ఎత్తివేత..
హైదరాబాద్ వనస్థలిపురంలో స్నేహితుడితో కలిసి ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ యువతి హోటల్కు వెల్లింది. కానీ వారి ప్లాన్ ను గ్రహించలేకపోయింది. స్నేహితులే కదా అని నమ్మకంతో వారితో కలిసి హోటల్ కు వెళ్లింది. అయితే అక్కడ యువకులతో పాటు యువతికూడా మద్యం సేవించినట్లు తెలుస్తుంది. అయితే స్నేహితులతో పాటు మరొక వ్యక్తి కూడా రావడంతో.. అతను కూడా మద్యం సేవించాడు. అయితే ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ.. స్నేహితురాలని ఆమె నివాశానికి తీసుకుని వెళ్లకుండా.. ఆమెపై అందరూ కలిసి అత్యాచారం చేయాలని ప్లాన్ వేసుకున్నారు. మద్యం మత్తులో వున్న స్నేహితురాలిని స్నేహితులే రేప్ చేశారు. స్నేహితులే కాకుండా వారితో పాటు వచ్చిన మరొక వ్యక్తి కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. మద్యం మత్తులో వున్న ఆ యువతి తరువాతి రోజు మేలుకువ రావడంతో.. తనపై అత్యాచారం జరిగిందని గ్రహించింది.
Read also: Telangana Assembly: నిన్నటిలా సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దు.. సభ్యులకు స్పీకర్ విజ్ఞప్తి..
స్నేహితులు అని నమ్మివస్తే తనకు మద్యం ఇచ్చిన అత్యాచారం చేశారని కన్నీరుకార్చింది. న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పథకం ప్రకారమే తనును హోటల్ రూం కు తీసుకుని వెళ్లి తనపై అత్యాచారం చేశారని అర్థమైందని వాపోయింది. స్నేహితులను నమ్మితే తనపై రేప్ చేశారని కన్నీరుమున్నీరుగా విలపించింది. స్నేహితులే కాదు వారితో వచ్చిన వ్యక్తి కూడా తనపై అత్యాచారం చేశారని పోలీసులకు తెలపింది. యువతి ఇచ్చిన ఆధారాలతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతిని ఎందుకు హోటల్ కు తీసుకుని వెళ్లారు. ఇంతకు ముందుకు కూడా ఇలానే చేశారా? లేక యువతిని స్నేహం పేరుతో ట్రాప్ చేసి ప్లాన్ ప్రకారం ఆమెకు మద్యం తాగింది ఇలా చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాపత్ఉ చేస్తున్నారు. స్నేహితులతో కలిసి వచ్చి మరో వ్యక్తి ఎవరు? అతను కూడా స్నేహితులతో కలిసి యువతిపై అత్యాచారం చేశాడంటే దీనిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మద్యంలో యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసి వుంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. యువతితో సహా తన స్నేహితులందరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పోలీసులు గుర్తించారు. అయితే వీరు ఏ సంస్థలో పనిచేస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.
Asia Cup 2025-India: 34 ఏళ్ల తర్వాత ఆసియా కప్కు భారత్ ఆతిథ్యం.. టీ20 ఫార్మాట్లో టోర్నీ!