Minister Adluri Laxman: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్స్ ఎన్టీవీతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. పొన్నం వ్యాఖ్యలు బాధాకరం అన్నారు. అయినా, అది మా పార్టీ, మా కుటుంబ సమస్యను మేమే పరిష్కరించుకుంటాం.. త్వరలోనే ఈ వివాదం సద్దుమణుగుతుందని అనుకుంటున్నాను.. ఈ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసి నాతో మాట్లాడారు అని చెప్పుకొచ్చారు.
Read Also: Nidhhi Agerwal : నేరేడు పళ్ళు.. నిధి అగర్వాల్ కళ్ళు.. హాట్ ఫొటోస్
అయితే, అంతకుముందు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో జరిగిన పొరపాటును ఒప్పుకొని క్షమాపణ చెబితే పొన్నంకు గౌరవంగా ఉంటుంది.. ఈ వ్యాఖ్యలపై నాపై చేసినవి కాదు, మొత్తం మాదిగ జాతిపై చేసినట్లుగా ఉందన్నారు. మాదిగలు అంటే మీకు అంత చిన్న చూపా అని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ అన్న మాటను సమర్ధించుకుని ఇప్పటి వరకు స్పందించకుండా ఉన్నావంటే ఈ విషయాన్ని నీ విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. ఇక, సహచర మంత్రిని, ఎస్సీ సామాజిక వర్గం నేతను ఆ మాట అంటుంటే చూస్తూ ఉంటావా అని మంత్రి వివేక్ వెంకటస్వామిని మంత్రి లక్ష్మణ్ కుమార్ నిలదీశారు.
Read Also: UP: ఓ అన్న మరణశాసనం.. నుదిటపై సిందూరం చూసి ఇంటర్ విద్యార్థి పరువు హత్య
ఇక, మంత్రి పొన్నం ప్రభాకర్- అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎపిసోడ్ పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రంగ ప్రవేశం చేశారు. ఇద్దరు మంత్రులకు ఫోన్ చేసి ఇరువురు సంయమనం పాటించాలని చెప్పినట్లు సమాచారం. అడ్లూరినీ ఉద్దేశించి పొన్నం కామెంట్స్ చేశారని ప్రచారం.. అడ్లూరిని ఉద్దేశించి మాట్లాడలేదని పొన్నం వివరణ ఇచ్చారు. పొన్నం కామెంట్స్ నీ తప్పు పట్టిన మంత్రి శ్రీధర్ బాబు.. పార్టీకి, ప్రభుత్వానికి ఇది మంచిది కాదంటూ శ్రీధర్ బాబు హితవు పలికారు.
