Banjara Hills Crime: రూ.6 కోట్ల ఆభరణాలు మామైన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని శ్రీ కృష్ణా జూవెలర్స్ షాప్ లో కలకలం రేపుతుంది. దీంతో షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
బంజారాహిల్స్ లోని శ్రీ కృష్ణా జూవెలర్స్ షాప్ కు చెందిన రోజూ లాగానే యజమాని వచ్చాడు. అయితే షాప్ అంత చిందర వందరగా ఉండటంతో అనుమానం వచ్చింది. షాప్ లో రూ.6 కోట్ల అభరణాలు చోరీ అయినట్లు గమనించాడు. దీంతో యజమానికి మేనేజర్ సుకేతుషాకు కాల్ చేశాడు. సుకేతుషా ఫోన్ స్వీచ్ ఆఫ్ వచ్చింది. యజమానికి సుకేతుషాపై అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఘటన వద్దకు చేరుకున్న పోలీసులు జూవెలర్స్ షాప్ యజమానికి ఆభరాణాల వివరాలను సేకరించారు. ఆభరణాలు మాయం అయినప్పటి నుంచి ఎవరెవరు షాప్ కు రాలేదని పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే సుకేతు షా అప్పటి నుంచి కనిపించకుండా పోయాడని, అతని ఫోన్ కూడా స్వీచ్ ఆఫ్ ఉందని యజమాని, అక్కడ పనిచేసేవారు చెప్పడంతో పోలీసులకు సుకేతు షాపై అనుమానం వ్యక్తం చేశారు. సుకేతుషాపై కేసు నమోదు చేశారు. సుకేతుషా కు షాప్ లో వున్న వారే సహకరించారని అనుమానిస్తున్నారు. అతనొక్కడే రూ.6 కోట్ల అభరణాలు మాయాం చేసేంత లేదని తెలిపారు. సుకేతుషాతో పాటుగా షాప్ లో పనిచేస్తున్న మరికొందరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేనేజర్ సుకేతు ఎక్కడి వెళ్లాడు? ఎప్పటి నుంచి షాప్ లో పనిచేస్తున్నాడనే దానిపై ఆరా తీస్తున్నారు.
Onion Peel: చెత్త బుట్టలో పడేసే ఉల్లి పొట్టుతో పుట్టెడు లాభాలు