తెలంగాణలో లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. సడలింపుల సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. కొత్త సడలింపులు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.. మొత్తంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెసులుబాటు ఉండనుండగా.. మరో 12 గంటల పాటు.. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయనున్నారు. ఇక, లాక్డౌన్ సడలింపుల సమయం పెరగడంతో.. తన సేవల సమయాన్ని కూడా పొడిగించింది హైదరాబాద్ మెట్రో రైలు.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మెట్రో సేవలను కొనసాగనున్నట్టు ప్రకటించారు.. అయితే, అన్ని చివరి స్టేషన్ల నుంచి సాయంత్రం 5 గంటలకు చివరి రైలు బయల్దేరుతుంది.. పొడింగించిన సమయం రేపటి నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు.
హైదరాబాద్ మెట్రో సేవల సమయం పొడిగింపు

metro rail