NTV Telugu Site icon

Praja Palana: ప్రజాపాలనలో ‘శివయ్య’ పేరుతో దరఖాస్తు.. ఆలయం కోసం ఇందిరమ్మ ఇల్లు కావాలని అర్జీ

Shiva Praja Palana

Shiva Praja Palana

Praja Palana: గత 9 రోజులుగా తెలంగాణలోని పల్లెలు, పట్టణాల్లో ప్రజాపరిపాలన దరఖాస్తు కార్యక్రమం జాతరలా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ‘అభయహస్తం’ పథకం కింద ప్రకటించిన 6 హామీల కోసం రాష్ట్రవ్యాప్తంగా కోటీ 24 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా వార్డులు, గ్రామ సభలు జనంతో కిక్కిరిసిపోయాయి. జిరాక్స్ సెంటర్లు, మీ సేవా కేంద్రాలు కూడా రద్దీగా కనిపించాయి. ఇదిలా ఉంటే ఈ కోట్ల దరఖాస్తుల్లో ‘శివయ్య’ పేరుతో ఓ దరఖాస్తు అందరి దృష్టిని ఆకర్షించింది. భార్య పేరు పార్వతీదేవి, కొడుకుల పేర్లు కుమారస్వామి, వినాయకుడిగా దరఖాస్తులో నింపారు. హాట్ టాపిక్ గా మారిన ఈ అప్లికేషన్ వెనుక కదిలే కారణం వెలుగులోకి వచ్చింది. తీవ్ర విమర్శలకు చెక్ పెట్టింది.

Read also: Lord Shiva Stotram: సోమవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే.. మృత్యు భయం తొలగిపోతుంది

హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన సామాన్యుడు ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి ‘శివుడి’ పేరిట ఈ దరఖాస్తును దాఖలు చేశారు. గ్రామంలోని త్రికూటేశ్వర ఆలయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. 12వ శతాబ్దంలో నిర్మించబడిందని విశ్వసించే ఈ పురాతన, అరుదైన మరియు అద్భుతమైన దేవాలయం అభివృద్ధి చెందకుండానే ఉంది. ఇది సురేందర్ రెడ్డితో పాటు గ్రామస్తులను బాధిస్తోంది. అయితే సురేందర్ రెడ్డి మాత్రం అందరిలా చూస్తూ ఊరుకోలేదు. 6 హామీల పథకం కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నప్పుడు అతనికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా దేవుడి పేరుతో దరఖాస్తు చేసుకున్నారు. దేవతల పేర్లు వివరాల్లో వ్రాయబడ్డాయి. ఫోటో అతికించాల్సిన చోట శివ ఫోటో కూడా పెట్టారు. ఆలయంలో పూజారికి చోటు లేదని, ఆ గది కోసం ‘ఇందిరమ్మ ఇల్లు’ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సురేందర్ రెడ్డి తెలిపారు. కరెంట్ బిల్లుకు కావాల్సిన ‘గృహజ్యోతి’ని టిక్ చేశామన్నారు.

Read also: FPI Investment : మోడీ ప్రభుత్వ విధానాలు.. వెల్లువలా వస్తున్న విదేశీ పెట్టుబడులు

రాష్ట్రకూటుల కాలంలో ఆలయాన్ని నిర్మించి విగ్రహాలను ప్రతిష్టించారని తెలిపారు. ప్రభుత్వ పాలన చివరి రోజైన జనవరి 6న వచ్చిన దరఖాస్తు అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ అప్లికేషన్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు ఓ పార్టీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఇది పింక్ బ్యాచ్ (బీఆర్‌ఎస్) చేసిన పని అని కొందరు ఆరోపించారు. మరికొందరు ‘రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని ఇంత పట్టుదలతో ఉన్నారా..?’ ఆ దరఖాస్తుపై దరఖాస్తు నంబర్ లేదు, అధికారులు తీసుకున్నట్లు గుర్తు లేదు. దేవుడి ఫొటో ఉన్న దరఖాస్తును అధికారులు ఎలా స్వీకరిస్తారంటూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అన్న అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ సురేందర్ రెడ్డి ఓ వీడియోను విడుదల చేశారు. అలా చేయడంలో ఎలాంటి లాభాపేక్ష, దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధి కోసమే తాను చేశానని నిజాయితీగా ఒప్పుకున్నాడు. అంతేకాదు.. ‘ఈ పని నేనే చేశాను. ఈ దరఖాస్తుతో అధికారులకు గానీ, ఇతరులకు గానీ ఎలాంటి సంబంధం లేదు. ఏం జరిగినా పూర్తి బాధ్యత నేనే తీసుకుంటానని సురేందర్ రెడ్డి నిర్భయంగా చెప్పారు.
Shiva Stotram: సోమవారం భక్తిశ్రద్ధలతో ఈ స్తోత్రాలు వింటే సర్వ పాపాల నుంచి విముక్తి..