Site icon NTV Telugu

రేపు జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశం

గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ప్రత్యేక సమావేశం, సాధారణ సర్వ సభ్య సమావేశం మంగళవారం ఉదయం 10 .30 గంటలకు వర్చ్యువల్ గా జరుగుతుందని జీహెచ్ఎంసీ తెలిపింది. కోవిడ్‌ నియమ, నిబంధనల నేపథ్యంలో మొదటి సారిగా నిర్వహిస్తున్న ఈ సమావేశం వర్చ్యువల్ గా నిర్వహించేందుకు సభ్యులందరికి ఐ.డి లను పంపించారు. రేపు జరిగే ఈ సమావేశంలో మొదటగా నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి ప్రసంగిస్తారు. నగరంలో జరగుతున్న అభివృద్ధిని వివరిస్తూ మేయర్ ప్రసంగించనున్నారు. అనంతరం.. 2021 – 22 సంవత్సరానికి గాను జీహెచ్ఎంసీ రూపొందించి, 2020 డిసెంబర్ 17 న స్టాండింగ్ కమిటీ ఆమోదించిన బడ్జెట్ ను ప్రవేశపెడతారు. బడ్జెట్ ఆమోదం అనంతరం జరిగే సాధారణ సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తారు.

Exit mobile version