TS: 1-9 క్లాస్‌ల ఫైనల్‌ పరీక్షల తేదీలు మార్పు.. 24 నుంచి వేసవి సెలవులు..

తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతల దృష్ట్యా ఒంటిపూట బడుల సమయాన్ని కుదించింది ప్రభుత్వం.. ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకే పాఠశాలలు పనిచేస్తున్నాయి.. ఇక, ఒకటో తరగతి నుండి 9వ తరగతి వరకు ఫైనల్ పరీక్షల తేదీలను రీషెడ్యూల్‌ చేసింది విద్యాశాఖ… గతంలో నిర్ణయించిన ప్రకారం.. ఏప్రిల్ 7వ నుండి కాకుండా.. ఏప్రిల్ 16వ తేదీ నుండి ప్రారంభమై ఏప్రిల్ 22వ తేదీ వరకు నిర్వహించనున్నారు.. ఇక, ఏప్రిల్‌ 23వ తేదీన ఫలితాలు వెల్లడించాల్సి ఉంటుంది.. అదే రోజు ఈ ఎడ్యుకేషన్‌ ఇయర్‌లో స్కూళ్లకు చివరి పని దినం కానుంది.. అంటే.. ఏప్రిల్‌ 24వ తేదీ నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది విద్యాశాఖ..

Read also: Bandi Sanjay: సిద్దిపేట సీపీకి రాష్ట్ర బీజేపీ చీఫ్‌ ఫోన్..