ఈటల బృందానికి ప్రమాదం తప్పింది. ఈటల రాజేందర్ ఢిల్లీ నుండి వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే ఫైలెట్ అలెర్ట్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. సమస్యను గుర్తించిన ఫైలెట్ చాకచక్యంగా వ్యవహరించారు. దీంతో అందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ విమానంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘనందన్, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి,తుల ఉమాతో పాటు మొత్తం 184 మంది ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఘటన అనంతరం ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో కాసేపటి క్రితమే ఈటల రాజేందర్ బృందం హైదరాబాద్ కు బయలు దేరింది. కాగా నిన్న ఈటలతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమా బిజేపిలో చేరిన సంగతి తెలిసిందే.