NTV Telugu Site icon

TS Eamcet 2022: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. టాప్ ర్యాంకర్లు వీరే

Sabitha Indrareddy

Sabitha Indrareddy

తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ సెట్‌లో 90.7 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎసెంట్‌ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లో 88.34 శాతం ఉత్తీర్ణులయ్యారు.

ఇంజినీరింగ్‌:
ఫస్ట్‌ ర్యాంక్‌ – లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డి (హైదరాబాద్‌), సెకండ్‌ ర్యాంక్‌ – సాయి దీపిక (శ్రీకాకుళం), థర్డ్ ర్యాంక్‌ – కార్తికేయ (గుంటూరు), అగ్రికల్చర్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌ – నేహ (గుంటూరు), సెకండ్‌ ర్యాంక్‌ – రోహిత్‌ (విశాఖ), థర్డ్ ర్యాంక్‌ – తరుణ్‌ (గుంటూరు)

ఇంజనీరింగ్‌:
ఫస్ట్‌ ర్యాంక్‌-లక్ష్మీసాయి లోహిత్‌
సెకండ్‌ ర్యాంక్‌- సాయిదీపిక
థర్డ్‌ ర్యాంక్‌- కార్తికేయ

అగ్రికల్చర్‌:
ఫస్ట్‌ ర్యాంక్‌- నేహ (గుంటూరు)
సెకండ్‌ ర్యాంక్‌-రోహిత్‌ (విశాఖ)
థర్డ్‌ ర్యాంక్‌-తరుణకుమార్‌ (గుంటూరు)

ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల‌ను జులై 18, 19, 20 తేదీల్లో రెండు విడుత‌ల్లో నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. అగ్రిక‌ల్చర్, మెడిక‌ల్ విభాగాల‌కు జులై 30, 31 తేదీల్లో ప్రవేశ ప‌రీక్షలు నిర్వహించారు. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీఎస్‌ ఎంసెట్‌ ఫలి‌తాలు శుక్రవారం విడు‌ద‌లయ్యాయి. ఇంజి‌నీ‌రింగ్‌, అగ్రి‌క‌ల్చర్‌, మెడి‌కల్‌ ఫలి‌తా‌లను విద్యా‌శాఖ మంత్రి సబి‌తా‌ఇం‌ద్రా‌రెడ్డి ఉద‌యం 11 గంట‌ల‌కు జేఎన్టీయూలో విడు‌దల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌ విభాగానికి 1.52 లక్షలమంది, అగ్రి ఎంసెట్‌కు 80 వేలమంది హాజ­రయ్యారు. ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాల కోసం వెబ్‌సైట్‌కు లాగిన్‌ అవ్వొచ్చు.
One Nation-One Examination: ఒకే దేశం-ఒకే పరీక్ష. నీట్, జేఈఈని కలిపి సీయూఈటీని నిర్వహించనున్న యూజీసీ