TS Double Bedroom: సెప్టెంబర్ 2న డబుల్ ఇండ్ల పంపిణీ.. గృహ ప్రవేశానికి మూడు రోజులే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Double Bedroom: మహానగరంలో సొంత ఇళ్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. తెలంగాణ ప్రభుత్వం అర్హులైన పేదలకు మరో మూడు రోజుల్లో గృహ ప్రవేశం లభిస్తుంది. ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన అధికారులు ర్యాండమైజేషన్ పద్ధతిలో అర్హులను ఎంపిక చేశారు. నియోజకవర్గానికి 500 మందికి చొప్పున గ్రేటర్లోని 24 నియోజకవర్గాల్లో 12 వేల మంది లబ్ధిదారులకు ఒకేరోజు డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేయనున్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు రానున్నాయన్న సమాచారంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపికైన లబ్ధిదారులకు సెప్టెంబర్ 2న డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ఆన్లైన్ డ్రా ద్వారా ఎంపికైన 12 వేల మంది లబ్ధిదారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని లబ్ధిదారులను అభినందించారు.
Read also: Rajini: జైలర్ కి షాక్… కలెక్షన్స్ ఫుల్ ఉండగానే ఒరిజినల్ ప్రింట్ లీక్…
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
మంత్రితో మాట్లాడిన బహదూర్పురా, ఆసిఫ్నగర్, సైదాబాద్, యూసుఫ్గూడ, బేగంబజార్, బోరబండ, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాలకు చెందిన పలువురు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేరాలన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు వంటి సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించామన్నారు. పేదల కోసం నిర్మించే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను దశలవారీగా దరఖాస్తు చేసుకున్న వారికి అందజేస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్ ఐసీ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ర్యాండమైజేషన్ సాఫ్ట్ వేర్ తో ఆన్ లైన్ డ్రా నిర్వహించినట్లు మంత్రి తలసాని వివరించారు. మొదటి దశలో ఒక్కో నియోజకవర్గంలో 500 మంది చొప్పున 12 వేల మందిని ఎంపిక చేశారు. సెప్టెంబరు 2న జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను కాలనీల్లో లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఎవరికి ఎక్కడెక్కడ ఇళ్లు మంజూరు చేస్తారు అనే పూర్తి వివరాలను అధికారులు తెలియజేస్తారని మంత్రి లబ్ధిదారులకు వివరించారు.
Metro Train: మెట్రోలో అమ్మాయిలు అలా చేశారేంటి?.. షాకై చూసిన ప్రయాణీకులు
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!