Rachakonda Report: రాచకొండ క్రైమ్ రిపోర్ట్ ఇదే… కమిషనర్ సుధీర్ బాబు క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rachakonda Report: రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య పెరిగిపోయిందని పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. 2023 సంవత్సరానికి సంబంధించిన క్రైం నివేదికను రాచకొండ సీపీ బుధవారం మీడియాకు వివరించారు. గతేడాదితో పోలిస్తే నేరాల సంఖ్య 6.8 శాతం పెరిగిందన్నారు. గతేడాది 27664 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 29166 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అలాగే సైబర్ క్రైమ్ కేసులు 25 శాతం పెరిగాయి. చైన్ స్నాచింగ్, అత్యాచారం, సాధారణ దొంగతనాల కేసులు తగ్గుముఖం పట్టాయి. పిల్లలపై లైంగిక వేధింపులు, హత్యలు, కిడ్నాప్ల కేసులు పెరిగాయి. డ్రగ్స్ కేసులో 12 మందిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేసినట్లు తెలిపారు. 282 డ్రగ్స్ కేసుల్లో 698 మందిని అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.
Read also: Kodali Nani: నాడు ఎన్టీఆర్, వైఎస్సార్.. నేడు వైఎస్ జగన్..
Also Read
- Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
- Kishan Reddy : అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
- SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
- Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
మహిళలపై నేరాలు 6.65 శాతం తగ్గాయి. మానవ అక్రమ రవాణాకు సంబంధించి 58 కేసుల్లో 163 మందిని అరెస్టు చేశారు. ఆరుగురిపై పీడీ యాక్ట్ పెట్టారు. గేమింగ్ యాక్ట్ కింద 188 కేసులు నమోదు చేసి 972 మందిని అరెస్టు చేశారు. ఏడాది కాలంలో 5241 నేరాలకు సంబంధించి శిక్షలు ఖరారు చేశామన్నారు. నేరారోపణల రేటు 62 శాతం పెరిగిందని చెప్పారు. 20 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడింది. సైబర్ నేరాల్లో 42 మంది అంతర్రాష్ట్ర, విదేశీ నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. సైబర్ నేరాల్లో నిందితుల బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.89.92 లక్షల నగదును స్తంభింపజేసి బాధితులకు అందజేశారు. ఆపరేషన్ స్మైల్ ద్వారా 64 మంది చిన్నారులను.. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 136 మంది చిన్నారులను కాపాడినట్లు వెల్లడించారు. 21 బాల్య వివాహాలను నిలిపివేశారు.
Read also: Bharat Rice: కిలో బియ్యం కేవలం 25 రూపాయలకే.. త్వరలో మార్కెట్లోకి భారత్ రైస్
మెట్రో రైళ్లలో 730 డెకాయ్ ఆపరేషన్లు జరిగాయి. కమిషనరేట్ పరిధిలో 16594 కేసులు నమోదు కాగా.. 2900 డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేశామన్నారు. రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. ఈ ఏడాది 3321 ప్రమాదాలు జరగగా 633 మంది మరణించారు. అలాగే, 3205 మంది గాయపడ్డారు. గతేడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాద మరణాలు 16 శాతం పెరిగాయి. ఈ ఏడాది 56 కేసుల్లో 153 మంది నిందితులను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అరెస్టు చేసింది. 71 మంది బాధితులకు విముక్తి కల్పించామన్నారు. సోషల్ మీడియాలో 8758 ఫిర్యాదులు రాగా 4643 పరిష్కరించినట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు.
Pawan Kalyan: న్యూ ఇయర్ కి ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ వస్తున్నాడు…
తాజావార్తలు
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
-
Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
-
Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
-
IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!