Rachakonda Report: రాచకొండ క్రైమ్ రిపోర్ట్ ఇదే… కమిషనర్ సుధీర్ బాబు క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rachakonda Report: రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య పెరిగిపోయిందని పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. 2023 సంవత్సరానికి సంబంధించిన క్రైం నివేదికను రాచకొండ సీపీ బుధవారం మీడియాకు వివరించారు. గతేడాదితో పోలిస్తే నేరాల సంఖ్య 6.8 శాతం పెరిగిందన్నారు. గతేడాది 27664 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 29166 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అలాగే సైబర్ క్రైమ్ కేసులు 25 శాతం పెరిగాయి. చైన్ స్నాచింగ్, అత్యాచారం, సాధారణ దొంగతనాల కేసులు తగ్గుముఖం పట్టాయి. పిల్లలపై లైంగిక వేధింపులు, హత్యలు, కిడ్నాప్ల కేసులు పెరిగాయి. డ్రగ్స్ కేసులో 12 మందిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేసినట్లు తెలిపారు. 282 డ్రగ్స్ కేసుల్లో 698 మందిని అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.
Read also: Kodali Nani: నాడు ఎన్టీఆర్, వైఎస్సార్.. నేడు వైఎస్ జగన్..
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
మహిళలపై నేరాలు 6.65 శాతం తగ్గాయి. మానవ అక్రమ రవాణాకు సంబంధించి 58 కేసుల్లో 163 మందిని అరెస్టు చేశారు. ఆరుగురిపై పీడీ యాక్ట్ పెట్టారు. గేమింగ్ యాక్ట్ కింద 188 కేసులు నమోదు చేసి 972 మందిని అరెస్టు చేశారు. ఏడాది కాలంలో 5241 నేరాలకు సంబంధించి శిక్షలు ఖరారు చేశామన్నారు. నేరారోపణల రేటు 62 శాతం పెరిగిందని చెప్పారు. 20 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడింది. సైబర్ నేరాల్లో 42 మంది అంతర్రాష్ట్ర, విదేశీ నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. సైబర్ నేరాల్లో నిందితుల బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.89.92 లక్షల నగదును స్తంభింపజేసి బాధితులకు అందజేశారు. ఆపరేషన్ స్మైల్ ద్వారా 64 మంది చిన్నారులను.. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 136 మంది చిన్నారులను కాపాడినట్లు వెల్లడించారు. 21 బాల్య వివాహాలను నిలిపివేశారు.
Read also: Bharat Rice: కిలో బియ్యం కేవలం 25 రూపాయలకే.. త్వరలో మార్కెట్లోకి భారత్ రైస్
మెట్రో రైళ్లలో 730 డెకాయ్ ఆపరేషన్లు జరిగాయి. కమిషనరేట్ పరిధిలో 16594 కేసులు నమోదు కాగా.. 2900 డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేశామన్నారు. రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. ఈ ఏడాది 3321 ప్రమాదాలు జరగగా 633 మంది మరణించారు. అలాగే, 3205 మంది గాయపడ్డారు. గతేడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాద మరణాలు 16 శాతం పెరిగాయి. ఈ ఏడాది 56 కేసుల్లో 153 మంది నిందితులను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అరెస్టు చేసింది. 71 మంది బాధితులకు విముక్తి కల్పించామన్నారు. సోషల్ మీడియాలో 8758 ఫిర్యాదులు రాగా 4643 పరిష్కరించినట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు.
Pawan Kalyan: న్యూ ఇయర్ కి ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ వస్తున్నాడు…
తాజావార్తలు
-
Huawei MateBook Pro S: హువావే మేట్బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్టాప్.. Kirin XE90 ప్రాసెసర్
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
-
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
-
Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!