CP Mahesh Bhagwat: ఉప్పల్ స్టేడియం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు.. 300 సీసీ కెమెరాలతో నిఘా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CP Mahesh Bhagwat Reveals Safety Arrangements At Uppal Stadium: ఈనెల 25న (ఆదివారం) ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే అధికారులు అక్కడ భారీఎత్తున భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎలాంటి అనివార్య సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. మొత్తం 40 వేల మంది క్రీడాభిమానులు మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియంకి వస్తారని, ట్రాఫిక్, లా & ఆర్డర్ సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. మొత్తం 2500 మంది సిబ్బందితో ఈ ఏర్పాట్లు నిర్వహించినట్టు పేర్కొన్నారు.
ఉప్పల్ స్టేడియం బయటున్న అప్రోచ్ రోడ్లను తమ అధీనంలోకే తీసుకున్నామని సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఆటగాళ్లందరూ ఈరోజు రాత్రికి నాగ్పూర్ నుంచి వస్తున్నారని.. వారికి కావాల్సిన ఏర్పాట్లన్నింటిని రెండు హోటల్స్లో జరిగాయని అన్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా.. మెట్రోను రాత్రి ఒంటిగంట వరకు తిప్పాలని తాము విజ్ఞప్తి చేశామన్నారు. ఆర్టీసీకి కూడా అదనపు బస్సుల కోసం లేఖ రాశామన్నారు. స్టేడియం వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని, 300 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. 21 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని, గేట్ నం.1 ద్వారా విఐపీ, వివిఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ సిద్ధం చేశామని వెల్లడించారు. ఒక్కొక్క పార్కింగ్లో 1400 ఫోర్ వీలర్స్ పట్టేలా ప్రత్యేక పార్కింగ్స్ ఏర్పాటు చేసినట్టుగా పేర్కొన్నారు.
Also Read
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
స్టేడియం చుట్టూ మూడు జంక్షన్లు ఉన్నాయని.. సాయంత్రం నాలుగు గంటల నుండి స్టేడియం వైపు భారీ వాహనాలకు అనుమతి లేదని సీపీ తేల్చేశారు. మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్న ఆయన.. ఏక్ మీనార్ వద్ద ఎలాంటి పార్కింగ్కి అనుమతి లేదన్నారు. సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఒంటి గంట దాకా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఐదు మొబైల్ పార్కింగ్లతో పాటు ఎమర్జెన్సీ వాహనాల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు సీపీ మహేశ్ భగవత్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Naga Vamsi: డిస్ట్రిబ్యూటర్లను చంపి ఎగ్జిబిటర్లను కాపాడటం సాధ్యమా?:
-
Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
-
Mythri Ravi: ముగ్గురిదీ ఒకే సమస్య: మైత్రీ రవి
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!