Site icon NTV Telugu

CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి..

Revanth Reddy Bhatti

Revanth Reddy Bhatti

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఇవాళ మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. వారి వెంట తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపా దాస్ మున్షీ వెళ్లనున్నారు. ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఈరోజు సాయంత్రం సమావేశం కానుంది. ఈ స‌మావేశంలో పెండింగ్‌లో ఉన్న పార్ల‌మెంట్ సీట్లపై చ‌ర్చించి అభ్య‌ర్థుల ఫైర్‌ను సీఈసీ ఖరారు చేయ‌నుంది. కాంగ్రెస్ పార్టీ 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో నాలుగు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. అధికారులతో మాట్లాడి అభ్యర్థులపై చర్చించి అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.

Read also: KCR: నేడు కేసీఆర్ జిల్లాల పర్యటన.. సూర్యాపేటలో మీడియా సమావేశం..

పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించింది. పోటీ ఎక్కువగా ఉండడంతో నేడు అధికారులతో చర్చించి పేర్లను ఖరారు చేయనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మధ్యాహ్నం కేకేశరావు నివాసానికి వెళ్లారు. కేకే కూతురు, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి నిన్న (శనివారం) కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేకే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయన చేరిక కాస్త ఆలస్యమైనట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ సీనియర్ నేతలు జానా రెడ్డి, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ తదితరులు కేకే నివాసానికి వెళ్లిన వారిలో ఉన్నారు.
Sreeleela : ప్రముఖ విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా శ్రీలీలా..!

Exit mobile version