NTV Telugu Site icon

CM KCR: ఆషామాషీగా పనిచేయలేదు.. ఒళ్లు దగ్గర పెట్టుకుని చేశాం

Cm Kcr

Cm Kcr

CM KCR: ఆషామాషీగా పని చేయలేదు.. ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రభుత్వం పని చేసిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మంలో ఎన్నికల ప్రచారలో భాగంగా.. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మన దేశంలో ఎన్నికలు వచ్చాయంటే అభాండాలు, అబద్ధాలు, హామీలు ఇవ్వడం దేశంలో ఎన్నికల సమయంలో జరుగుతున్నవే అన్నారు. రాయి ఏది రత్నం ఏదో తెలుసుకోవాలని సూచించారు. రిజల్ట్స్ వచ్చిన రోజున దుకాణం క్లోజ్ అవ్వదు.. అదే రోజు ప్రారంభం అవుతుందన్నారు. అభ్యర్థి గెలుపును బట్టే ప్రభుత్వం వుంటుందన్నారు. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం ఓటు అని తెలిపారు. ప్రజల తల రాతను రాష్ట్ర ప్రజల భవితవ్యం నిర్ణయిస్తుందని అన్నారు. ప్రజల కోసమే బీఆర్ఎస్ పుట్టిందన్నారు. తెలంగాణ ఇవ్వడంలో అనేక సార్లు డోకా చేశారని తెలిపారు. మన మీద ప్రేమతో తెలంగాణ ఇవ్వలేదు.. తప్పని సరి పరిస్థితిలో ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ చరిత్ర మోసాల చరిత్ర అని మండిపడ్డారు. 50 ఏళ్లు కాంగ్రెస్ పరిపాలించిందని స్పష్టం చేశారు.

Read also: PM Modi: ప్రధాని మోదీ, యూపీ సీఎంను చంపేస్తామంటూ బెదిరింపు కాల్.. వ్యక్తి అరెస్ట్‌

పదేళ్ల లో ఎక్కడ పంటలు ఎండలేదని అన్నారు. ఆషామాషీగా పనిచేయలేదు.. ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రభుత్వం పని చేసిందని అన్నారు. సీతారాం కంప్లీట్ అయితే నాలుగు కోట్ల ధాన్యం పండుతుందని అన్నారు. విద్యుత్ వినియోగంలో దేశంలో టాప్ లో ఉన్నామని గుర్తు చేశారు. చిత్తశుద్ది కమిట్మెంట్ తో పని చేశామని అన్నారు. రెండు సార్లు ఓడించారు.. అయిన మీ మీద అలుగా లేదన్నారు. మధిర నాది… ఏ ఇంచు అయిన కేసీఆర్ దే అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాకు విరోధి.. అయిన అభివృద్ధి మధిరలో చేశామన్నారు. భట్టి కాంగ్రెస్ అయినప్పటికీ పక్షపాతంగా వ్యవహరించలేదని తెలిపారు. చింతకాని మండలం దళిత బందు ప్రతి కుటుంభానికి ఇచ్చానని అన్నారు. దళిత బందు చేయమని బట్టి నన్ను అడుగులేదన్నారు. తెలంగాణ దళిత బందు దేశానికి మార్గ దర్శకత్వం అని అన్నారు. పట్టు లేని బట్టి విక్రమార్క మనకు చేసిందేమిటి? అని ప్రశ్నించారు. నియోజకవర్గానికి చుట్టం చూపుతో వస్తారని మండిపడ్డారు. 20 మంది సీఎంలు కాంగ్రెస్ లో వున్నారని వ్యంగాస్త్రం వేశారు. గతంలో కంటే రెండు సీట్లు బీఆర్ఎస్ పెరుగుతుందన్నారు. భట్టి వల్ల మీకు వచ్చేది ఏమి లేదని అన్నారు. భట్టికి ఒక్క ఓటు కూడా పడొద్దు.. భట్టి గెలిచేది లేదు సీఎం అయ్యేది లేదు. ఇందిరమ్మ రాజ్యంలో ఎవ్వరికీ ఒరిగేది లేదని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో కరెంట్ లేదని అన్నారు. భట్టి విక్రమార్క మార్పు చేయాలి కదా? బోనకల్లో దళితులు దళిత బందు పెట్టమని అడిగారు అందువల్లనే ప్రకటించానని అన్నారు. మిగిలిన నియోజకవర్గం మొత్తం దళిత బందు ఇస్తానని అన్నారు.
PM Modi: ప్రధాని మోదీ, యూపీ సీఎంను చంపేస్తామంటూ బెదిరింపు కాల్.. వ్యక్తి అరెస్ట్‌