Site icon NTV Telugu

Kondagattu : కాషాయ వర్ణంగా మారిన అంజన్న క్షేత్రం..

Hanuman Jayanthi

Hanuman Jayanthi

మల్యాల మండలం కొండగట్టులోని ఆంజనేయ స్వామి ఆలయానికి శనివారం చిన్న హనుమాన్‌ జయంతి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కోవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా హనుమాన్ జయంతి వేడుకలకు హాజరుకాలేకపోయిన భక్తులు శుక్రవారం రాత్రి నుండి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం ప్రారంభించారు. అంజన్న సన్నిధిలో దీక్ష విరమించడానికి చిన్న హనుమాన్ జయంతి పవిత్రమైన రోజు అని బలంగా నమ్ముతున్నందున హనుమాన్ దీక్షను తీసుకున్న భక్తులు కొండగట్టు ఆలయంలో దీక్ష విరమించారు.

అంజనేయ స్వామి దీక్షదారులతో కొండగట్టు కాషాయమయంగా మారింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్నారు. స్వామి వారి దర్శనానికి దాదాపు 4 గంటల సమయం పట్టింది.

మరోవైపు భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల్లో తాగునీటి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, వేసవికాలం ఎండ తీవ్రతం అధికంగా ఉన్న నేపథ్యంలో పాత్ మార్గంలో తాత్కాలిక పండళ్లను కూడా ఏర్పాటు చేశారు. 60 తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్ స్థలాలు, ఇతర ఏర్పాట్లు కూడా చేశారు. జయంతి వేడుకలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు తగిన బలగాలను మోహరించారు. వేములవాడ నుండి కొండగట్టు వరకు భక్తులను ఉచితంగా తరలించేందుకు వేములవాడ టీఎస్‌ఆర్టీసీ డిపో అధికారులు 4 మినీ బస్సులను నడుపుతున్నారు.

Special Trains : సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి స్పెషల్‌ ట్రైన్‌.. ఎప్పుడంటే..?

Exit mobile version