బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఖమ్మం ముస్తాబైంది. నగరం మొత్తం గులాబీ రంగులోకి మారింది. అయితే సీఎం కేసీఆర్తోపాటు పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల బీఆర్ఎస్ జెండాలు, హోర్డింగ్లు, కటౌట్లు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు సభా ప్రాంగణానికి తరలివస్తున్నారు.